రకుల్ బాటలో మహేష్ హీరోయిన్.!
- May 24, 2022
‘వన్ - నేనొక్కడినే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్ తాజాగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఇంతకీ ఏంటా బిజినెస్ అంటారా.? ఫిట్నెస్ బిజినెస్. అర్ధమైపోయుంటుంది ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ రంగంలో సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ సహా కొన్ని మెట్రో సిటీస్లో రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సెంటర్లను ఓపెన్ చేసి తన బిజినెస్ని విస్తరించుకుంటూ పోతోంది. అదే బాటలో ఇప్పుడు కృతిసనన్ కూడా నడుస్తోంది. ‘ది ట్రైబ్’ పేరుతో ఓ ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేసింది కృతిసనన్.
త్వరలోనే ఈ సంస్థను రకుల్ లాగానే పలు మెట్రో సిటీస్కి విస్తరించాలనుకుంటోందట. అత్యున్నతమైన ఆధునిక, సాంకేతిక పరికరాలు తన ఫిట్నెస్ సెంటర్లో అందుబాటులో వున్నాయని కృతిసనన్ చెప్పుకొచ్చింది. అత్యుత్తమ ఫిట్నెస్ మాస్టర్లు ఈ సంస్థలో ట్రైనింగ్ ఇవ్వనున్నారట.
‘మిమి’ సినిమా కోసం తాను ఏకంగా 15 కేజీల బరువు తగ్గాననీ, ఆ టైమ్లోనే ఓ ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మదిలో మెదిలిందనీ, కరోనా ప్యాండమిక్ టైమ్లో ఆ ఆలోచనకు బలం చేకూరిందని.. ఈ సంస్థను ఓ బ్రాండ్గా విస్తరింపచేయాలన్నదే తన టార్గెట్ అని కృతిసనన్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ చిత్రంలో కృతిసనన్ నటిస్తోంది. ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







