కాంగ్రెస్ కు మరో షాక్..రాజీనామా చేసిన కపిల్ సిబాల్..ఆ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్
- May 25, 2022
న్యూఢిల్లీ: 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యంగల నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్ సిబాల్ సమాజ్వాదీ పార్టీ తరపున రాజ్య సభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో బుధవారం (మే 25,2022) సమావేశమయ్యారు.ఈక్రమంలో కపిల్ సిబాల్ సమాజ్ వాదీ పార్టీ తరపున లక్నోలో రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. కాగా..రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాన పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి.
కపిల్ సిబల్ నామినేషన్ పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజ్వాదీ పార్టీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసారని తెలిపారు. సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. మొదటి నమోదు పూర్తయింది. రాజ్యసభకు మరో ఇద్దరి పేర్లను త్వరలో ప్రకటించనున్నారు.
#WATCH | Kapil Sibal filed nomination for Rajya Sabha elections, with the support of SP, in presence of party chief Akhilesh Yadav & party MP Ram Gopal Yadav
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022
He says, "I've filed nomination as Independent candidate. I have always wanted to be an independent voice in the country" pic.twitter.com/HLMVXYccHR
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









