ఈ నెల 29న రెండు వాక్ ఇన్ పాస్పోర్ట్ శిబిరాలను ఏర్పాటు చేయనున్న ఇండియన్ కాన్సులేట్
- May 26, 2022
దుబాయ్: ఈ నెల 29న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్, నార్తర్న్ లో ఉన్న ఆరు బీఎల్ఎస్(BLS) ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్లలో వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉదయం 10 గంగల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పాస్పోర్ట్ లు, వీసా సమస్యలను పరిష్కరించనున్నారు. దరఖాస్తుదారులు ఆన్లైన్ పూరించిన దరఖాస్తును BLS కేంద్రాలలో సమర్పించవచ్చు. అపాయింట్మెంట్ లేకుండా.. మొదట వచ్చిన వారికి ప్రధాన్యత ఇవ్వబడుతుంది. 31.08.2022 నాటికి పాస్పోర్ట్ ల గడువు ముగుస్తున్న వారు, అత్యవసర కేసులు (వైద్య చికిత్స, మరణం), అత్యవసర పాస్పోర్ట్ పునరుద్ధరణ, గడువు ముగిసిన లేదా రద్దు చేయబడిన వీసాను తిరిగి ముద్రించడానికి(కొత్త ఉద్యోగం కోసం వీసా), రాబోయే వారాల్లో విదేశాలకు/భారతదేశానికి ప్రయాణించేవారు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు/ అవుట్ పాస్, పాస్పోర్ట్ లు పోయిన/పాడైనవి, NRI సర్టిఫికెట్లు (విద్యాపరమైన ప్రయోజనం కోసం), భారతదేశంలో ప్రవేశ ప్రయోజనాల కోసం లేదా దరఖాస్తు కోసం ప్రయాణించే విద్యార్థులకు పాస్పోర్ట్ పునరుద్ధరణ వంటి సేవలను అందించనున్నారు. అల్ ఖలీజ్ సెంటర్, దీరా సిటీ సెంటర్, ప్రీమియం లాంజ్ సెంటర్, షార్జా HSBC సెంటర్, ఇండియన్ అసోసియేషన్ షార్జా BLS కేంద్రాలలో దరఖాస్తును సమర్పించవచ్చు. ఏవైనా ప్రశ్నలు/ఫీడ్బ్యాక్ కోసం ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం (PBSK) టోల్-ఫ్రీ నంబర్: 80046342 లేదా [email protected] ; [email protected] లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







