ఖతార్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం
- May 26, 2022
దోహా: దేశంలో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నియంత్రిస్తూ మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా నిర్ణయాన్ని ఖతార్ క్యాబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అమిరి దివాన్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే ఖతార్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య దౌత్య, ప్రత్యేక, అధికారిక పాస్పోర్ట్ లను కలిగి ఉన్నవారికి వీసా అవసరాలను రద్దు చేసే ముసాయిదా ఒప్పందాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. సంస్థలు, కంపెనీలు, షాపింగ్ కేంద్రాలు అన్ని రకాల ఉత్పత్తులను, వస్తువులను ప్యాకేజింగ్, ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, తీసుకువెళ్లడం లేదా రవాణా చేయడంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగించడం నిషేధించారు. వాటి స్థానంలో బహుళ వినియోగ ప్లాస్టిక్ సంచులు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులు, కాగితం లేదా "నేసిన" సంచులు, ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్లతో చేసిన వాటిని ఉపయోగించాలని ముసాయిదా తీర్మానంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







