ఖతార్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం
- May 26, 2022
దోహా: దేశంలో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నియంత్రిస్తూ మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా నిర్ణయాన్ని ఖతార్ క్యాబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అమిరి దివాన్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే ఖతార్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య దౌత్య, ప్రత్యేక, అధికారిక పాస్పోర్ట్ లను కలిగి ఉన్నవారికి వీసా అవసరాలను రద్దు చేసే ముసాయిదా ఒప్పందాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. సంస్థలు, కంపెనీలు, షాపింగ్ కేంద్రాలు అన్ని రకాల ఉత్పత్తులను, వస్తువులను ప్యాకేజింగ్, ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, తీసుకువెళ్లడం లేదా రవాణా చేయడంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగించడం నిషేధించారు. వాటి స్థానంలో బహుళ వినియోగ ప్లాస్టిక్ సంచులు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులు, కాగితం లేదా "నేసిన" సంచులు, ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్లతో చేసిన వాటిని ఉపయోగించాలని ముసాయిదా తీర్మానంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







