ఐపీఎల్ గ్రౌండ్స్మెన్కు రూ.1.25 కోట్ల నజరానా
- May 30, 2022
న్యూ ఢిల్లీ: ఐపీఎల్ ఉత్కంఠ భరింతగా సాగింది. ఐపీఎల్ 2022 టోర్నీ విజయవంతంగా ముగిసింది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురవేసుకుపోయింది.కొత్త జట్టుగా అడుగుపెట్టి కప్పు కొట్టేసింది.ఐపీఎల్ ఫైనల్లో విజేతగా నిలిచిన సందర్భంగా మైదానంలో వేడుకలు జరిపారు.ఐపీఎల్ మ్యాచులు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రతి మ్యాచ్ కు సంబంధించి వెనుకుండి నిర్వహించిన గ్రౌండ్స్ మెన్స్, క్యూరేటర్లకు బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించింది.ఈ ఏడాది కరోనా భయంతో ఐపీఎల్ మ్యాచులను కేవలం 6 మైదానాలకే పరిమితం చేయాల్సి వచ్చింది.
అందులో ఎక్కువగా జరిగిన మ్యాచ్లు.. ముంబై, పూణేలోని నాలుగు మైదానాల్లోనే లీగ్ దశలోని 70 మ్యాచులు నిర్వహించారు.ప్లేఆఫ్స్ కోసం ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియాలను ఉపయోగించారు.ఇటీవలే ఈ మైదానాల గ్రౌండ్స్మెన్కు రూ.1.25 కోట్ల బహుమతి అందిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ మేరకు ట్వీట్ చేశారు.ఎంసీఏ, వాంఖడే, డీవై పాటిల్, సీసీఐ, పూణే స్టేడియాల్లో ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు షా వెల్లడించారు. ప్లేఆఫ్స్ నిర్వహించిన ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియం నిర్వాహకులకు తలో రూ.12.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించనున్నట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







