పది నిమిషాల్లో మద్యం డెలివరీ..
- June 05, 2022
హైదరాబాద్: భారత్ లో ఇప్పటికే అనేక నగరాల్లో మద్యం డెలివరీకి అనుమతి ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. కోల్కతా నగరంలో కూడా ఈ సేవలు కొనసాగుతున్నాయి. అయితే, కోల్కతాలో పది నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఒక స్టార్టప్ ముందుకొచ్చింది. హైదరాబాద్కు చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్కతా నగరంలో మద్యం డెలివరీ సేవలు ప్రారంభించింది. అది కూడా పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చెబుతోంది కంపెనీ.ఇప్పటికే అక్కడ మద్యం డెలివరీ సేవలు కొనసాగుతున్నాయి.
అయితే, పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ప్రకటించిన మొదటి సంస్థ మాత్రం ‘బూజీ’నే. ఈ సేవలకు గాను ‘బూజీ’కి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ అనుమతి కూడా లభించింది. ‘బూజీ’ సంస్థ స్థానికంగా ఉన్న వైన్ షాపుల నుంచి మద్యాన్ని సేకరించి, వినియోగదారులకు అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ ద్వారా వినియోగదారుల ప్రవర్తనను ఈ యాప్ అంచనా వేస్తుందని యాప్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!







