సామాజిక బాధ్యతపై సమావేశం
- April 08, 2016
సామాజిక బాధ్యత మరియు సస్టెయినబుల్ డెవలప్మెంట్ 2016పై బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎనర్జీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ హుస్సేన్ మీర్జా నేతృత్వంలో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటయ్యింది. బహ్రెయిన్ సొసైటీ ఫర్ సోషల్ రెస్పాన్సిబులిటీ, నేషనల్ గ్యాస్ అండ్ ఆయిల్ అథారిటీ సహకారంతో ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. బహ్రెయిన్, గల్ఫ్ స్టేట్స్ మరియు న్యూజిలాండ్ నుంచి 14 మంది వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. 14 పేపర్స్ ఈ సందర్భంగా ప్రెజెంట్ చేయబడ్డాయి. సస్టెయినబుల్ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ సెక్టార్ ఓ పోర్ట్ ఫోలియోను ఏర్పాటు చేయాలని, ఇది ఓ ఇండిపెండెంట్ నేషనల్ కమిషన్ ద్వారా పనిచేసేలా చూడాలనీ, అలాగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి మద్దతు పలికేలా ప్రైవేటు సంస్థలు సహాయ సహకారాలు అందించాలనీ ఈ సందర్భంగా తీర్మానించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







