భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవం ఇస్తుంది: ఎంబసీ

- June 06, 2022 , by Maagulf
భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవం ఇస్తుంది: ఎంబసీ

కువైట్ సిటీ: మన నాగరికత వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం యొక్క బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా  భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తోందని  కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్ర‌క‌టించింది. అంతకు ముందు, ప్రవక్త మొహమ్మద్ (స)ను అవమానించిన వారిపై అధికారికంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనికి సంబంధించిన వారిపై భార‌త ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంబ‌సీలో ఫిర్యాదు చేసింది. అలాగే వారిపై  భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను కువైట్ స్వాగ‌తించింది.  అన్ని మతాల పట్ల గౌరవం వ్య‌క్తం చేస్తూ..  ఇత‌రుల మతపరమైన వ్యక్తిత్వాన్ని అవమానించడం లేదా ఏదైనా మతం లేదా వర్గాన్ని కించపరచడం వంటి వాటిని ఖండిస్తూ సంబంధిత వర్గాలు ఒక ప్రకటనను కూడా విడుదల చేశాయని ఎంబసీ ప్రతినిధి తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com