ఉచితంగా పాఠశాల విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
- June 07, 2022
            యూఏఈ: ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబిలిష్ మెంట్(ESE) ప్రకారం, ఉచితంగా పాఠశాల విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే యూఏఈ మరియు అర్హులైన ప్రవాసి విద్యార్థులు తమ నివాసం దగ్గరలోని Ajyal అనే మోడల్ పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలి.
ESE ప్రకారం,ఈ నూతన మోడల్ పాఠశాలల్లో సిలబస్ , స్కూల్ టైమింగ్స్ మరియు ఇతరత్రా వన్ని యధావిధిగా ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే ఉంటాయి.అలాగే, తమ పిల్లల చదువుకోవడం కోసం పాఠశాలను ఎంచుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది.
అలాగే, ఈ పాఠశాలల్లో చదువుకోవడం కోసం అదనపు ఫీజులు చెలించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే వాటిని పూర్తిగా భరిస్తుంది.ESE పర్యవేక్షణలో ప్రస్తుతం ఈ 10 నూతన మోడల్ పాఠశాలల్లో 1 - 4 గ్రేడ్ తరగతులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.2024 నాటికి 5, 6 గ్రేడ్స్ లకు ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి పర్యాయం దరఖాస్తులు తిరస్కరించిన వారికి మరో దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది.
ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి నష్టం వాటిళ్లకుండా యూఏఈ విద్యావిధానం ప్రకారం శాస్త్రీయ పద్దతిలో విద్యా పద్దతులను ప్రవేశపెట్టడం జరిగిందని ESE పేర్కొంది.
ఈ నూతన విద్యా విధానాన్ని ప్రయివేటు రంగం భాగస్వామ్యంతో 2022-23 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 







