గ్యాంగ్ రేప్ ఘటన..తెలంగాణ సీఎస్, డీజీపీలకు నోటీసులు
- June 07, 2022
            హైదరాబాద్: హైదరాబాద్లో కలకలం రేపుతున్న ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్పై జాతీయ మహిళా కమిషన్ కూడా దృష్టి సారించింది. పబ్ వద్దకు వచ్చిన ఓ మైనర్ బాలికను కారులో ఎక్కించుకున్న ఐదుగురు యువకులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లు ఆందోళన వ్యక్తం చేయడంతో ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అసలు దోషులను పోలీసులు కాపాడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపైనా విచారణ మొదలుపెట్టినట్టు మహిళా కమిషన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







