గ్యాంగ్ రేప్ ఘటన..తెలంగాణ సీఎస్, డీజీపీలకు నోటీసులు
- June 07, 2022
            హైదరాబాద్: హైదరాబాద్లో కలకలం రేపుతున్న ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్పై జాతీయ మహిళా కమిషన్ కూడా దృష్టి సారించింది. పబ్ వద్దకు వచ్చిన ఓ మైనర్ బాలికను కారులో ఎక్కించుకున్న ఐదుగురు యువకులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లు ఆందోళన వ్యక్తం చేయడంతో ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అసలు దోషులను పోలీసులు కాపాడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపైనా విచారణ మొదలుపెట్టినట్టు మహిళా కమిషన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 







