జీహెచ్ఎంసీ బిజెపి కార్పొరేటర్లతో ముగిసిన ప్రధాని మోడీ భేటీ
- June 07, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాని మోడీ ఈరోజు మంగళవారం జీహెచ్ఎంసీ బిజెపి కార్పొరేటర్లతో ఢిల్లీ లో భేటీ అయ్యారు. సాయంత్రం 4గంటలకు కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్, గ్రామీణం, మేడ్చల్ అర్బన్, గ్రామీణం, సికింద్రాబాద్, సెంట్రల్ జిల్లా అధ్యక్షులు మోడీ తో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వీరితో మోడీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లకు మోదీ నుంచి ఆత్మీయ పలకరింపు దక్కింది. ప్రతి కార్పొరేటర్ వద్దకు వచ్చిన మోదీ వారి వివరాలు, వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి పిల్లలు, విద్యాభ్యాసం తదితరాలను కూడా మోదీ అడిగి తెలుసుకున్నారు.
ప్రధాన మంత్రి హోదాలో ఉన్న నేత నుంచి ఈ తరహా పలకరింపు ఎదురయ్యేసరికి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. గడచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటారని కార్పొరేటర్లను మెచ్చుకున్న మోదీ… త్వరలో రానున్న ఎన్నికల్లో మరింత మేర సత్తా చాటాలని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని, హైదరాబాద్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఆయన కార్పొరేటర్లను కోరారు.

తాజా వార్తలు
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







