వర్షంలో డ్రైవింగ్ చేస్తూ ఫోటోలు తీయడం మానాలి
- April 08, 2016
వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో వాహనదారులు వేగంగా నడపకుండా జాగ్రత్తగా వెళ్ళాలని, అలాగే ఫోటోలను తీయకూడదని కతర్ వాతావరణ శాఖ సూచించింది వర్షం వచ్చే అవకాశం దృష్ట్యా శుక్రవారం రాత్రి వరకు కతర్ వాతావరణ శాఖ దేశ నివాసులను కోసం సాధారణ భద్రతకు చిట్కాలు జారీ చేసింది . " ఉరుములతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, త్వరగా ఇంటికి వెళ్లి పొవడానికి ప్రయత్నించండి. ఒక వేళ మీరు వాహానాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటే , ఒక సురక్షిత స్థానంలో మీ కారుని ఆపండి. కారు కిటికీ అద్దాలు మూసి ఉంచడం మంచిది.ఉరుములు తగ్గింతవరకు ఇలా చేయండని " ప్రజలకు సలహా చెప్పారు.బలమైన గాలులు ,ఉరుములతో కూడిన వాతావరణ పరిస్థితులు మరియు ఎత్తుగా ఎగిసిపడే కెరటాలు అస్థిర వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఆ సమయంలో సముద్రం లోనికి ప్రవేశించకుండా నివారించాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది,వాతావరణ శాఖ తాజా వాతావరణం నవీకరణలను మరియు హెచ్చరికలు తెల్సుకోవాలంటే అధికారిక వెబ్సైట్ మరియు వివిధ సామాజిక మీడియా ఖాతాల ద్వారా అనుసరించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







