టిఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్‌ షాక్‌.. మరోసారి ఛార్జీల పెంపు

- June 08, 2022 , by Maagulf
టిఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్‌ షాక్‌.. మరోసారి ఛార్జీల పెంపు

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి చార్జీల మోత మోగనుంది.ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్‌ సెస్‌ వసూలు చేయనున్నారు.పల్లెవెలుగులో  250 కి.మీ. దూరానికి రూ.5 నుంచి రూ.45కి పెంచారు.ఎక్స్‌ప్రెస్‌లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.90కి పెంచుతూ నిర్ణయించారు.  డీలక్స్‌ బస్సుల్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.125కి పెంచారు.సూపర్ లగ్జరీలో 500 కి.మీ.దూరానికి రూ.10 నుంచి రూ.130కి పెంచుతున్నట్లు ప్రకటించారు.ఏసీలో 500 కి.మీ. దూరానికి రూ.10 నుంచి రూ.170కి పెంచారు.హైదరాబాద్‌ పరిధిలో డీజిల్‌ సెస్‌ లేదని టీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది.చార్జీల పెంపు నుంచి GHMCని మినహాయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com