ఏపీ సీఎం జగన్ ఫ్రాన్స్ పర్యటన ఖరారు…
- June 17, 2022
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న వ్యక్తిగత పనుల నిమిత్తం పారిస్ పర్యటనకు వెళుతున్నారు. ఆయన పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.
పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి జులై 2న కాన్వోకేషన్ తీసుకోనున్నారు.కుమార్తె కాన్వోకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు.అనంతరం రాష్ట్రానికి తిరిగి వస్తారు. మరోవైపు పారిస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు.
దేశంవిడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు ఆదేశాలనుసడలించాలని… కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి వెళ్లి వస్తానని ఆయన కోరారు. ఇందుకోసం జూన్ 28 నుంచి వారం రోజులు పాటు పారిస్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







