ఏపీ సీఎం జగన్‌ ఫ్రాన్స్‌ పర్యటన ఖరారు…

- June 17, 2022 , by Maagulf
ఏపీ సీఎం జగన్‌ ఫ్రాన్స్‌ పర్యటన ఖరారు…

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న వ్యక్తిగత పనుల నిమిత్తం పారిస్ పర్యటనకు వెళుతున్నారు. ఆయన పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.

పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి జులై 2న కాన్వోకేషన్ తీసుకోనున్నారు.కుమార్తె కాన్వోకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు.అనంతరం రాష్ట్రానికి తిరిగి వస్తారు. మరోవైపు పారిస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు.

దేశంవిడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు ఆదేశాలనుసడలించాలని… కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి వెళ్లి వస్తానని ఆయన కోరారు. ఇందుకోసం జూన్ 28 నుంచి వారం రోజులు పాటు పారిస్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com