3.5 మిలియన్ల యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం
- June 17, 2022
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ వద్ద నిర్మాణ సామగ్రి రవాణాలో దాచి అక్రమంగా తరలిస్తున్న 3.5 మిలియన్లకు పైగా యాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ముగ్గురు టర్కీ అనుమానితులను అరెస్టు చేశామని, వీరిలో ఇద్దరు రాజ్యంలో నివాసం ఉంటున్నారని, మూడో వ్యక్తి సందర్శకుల వీసాపై దేశానికి వచ్చాడని నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నుజైదీ తెలిపారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల, సౌదీ అధికారులు 403,000 కంటే ఎక్కువ మాత్రలను అక్రమంగా తరలించే కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







