భారత్ గోధుమలపై నిషేధం.. కువైట్కు మినహాయింపు
- June 17, 2022
కువైట్ సిటీ: రాబోయే కాలంలో కువైట్కు అవసరమైన అన్ని ఆహార ఉత్పత్తులను అందించడానికి భారతదేశం తన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసింది. గోధుమలతో సహా ఆహార ఉత్పత్తుల ఎగుమతిపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. కువైట్లో భారత రాయబారి సిబి జార్జ్.. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఫహద్ అల్-షరియాన్కు ఒక సమావేశంలో ఈ మేరకు హామీ ఇచ్చారు.కరోనా సమయంలో కువైట్ పోషించిన గొప్ప పాత్రను సిబి జార్జ్ గుర్తుచేసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారతదేశానికి 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, వెయ్యికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కువైట్ సరఫరా చేసిన విషయం తెలిసిందే. కువైట్కు గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసే నిర్ణయంతో సహా, కువైట్కు అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు భారతదేశం సంసిద్ధత వ్యక్తం చేసిందని కువైట్ మంత్రికి భారత రాయబారి తెలిపినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







