రూ.86 లక్షల బంగారం స్మగ్లింగ్‌.. హైదరాబాద్‌లో కువైట్‌ మహిళ పట్టివేత

- June 18, 2022 , by Maagulf
రూ.86 లక్షల బంగారం స్మగ్లింగ్‌.. హైదరాబాద్‌లో కువైట్‌ మహిళ పట్టివేత

కువైట్: కువైట్ నుండి ఇండియాలోని హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 86 లక్షల రూపాయల విలువైన 1.646 కిలోల బంగారాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుండి J9403 విమానంలో వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలి నుండి బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో షూ లోపల సాక్స్, నల్లటి ప్లాస్టిక్ కవరింగ్‌లో దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com