సౌదీ ఎడారిలో దాహంతో తండ్రీ కొడుకులు మృతి
- June 18, 2022
సౌదీ: సౌదీ అరేబియాలోని అజ్మాన్ వ్యాలీ ఎడారిలో ఒక కువైట్ వ్యక్తి, అతని 8 ఏళ్ల కుమారుడు దాహంతో మరణించిన ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు తమ గొర్రెలు మేపుకుంటూ ఎడారిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి వస్తుండగా, వారి వాహనం ఇసుకలో చిక్కుకుందని, ఆ సమయంలో వారు సహాయం కోసం ఎవరినీ సంప్రదించలేకపోయారని స్థానిక మీడియా పేర్కొంది. ఇసుకలోంచి వాహనాన్ని బయటకు తీయడానికి తండ్రి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఆ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్రత్ మొఘటి ప్రాంతానికి కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ మధ్యలోనే దాహంతో వారు చనిపోయారు. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఎడారి ప్రాంతంలో డీహైడ్రేషన్ కారణంగా వారు అపస్మారక స్థితికి చేరుకుని మరణించారని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం తమతో ఫోన్లో మాట్లాడినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. తన కారు చెడిపోయిందని, దాన్ని సరిచేసుకొని వస్తానని తమకు తెలిపినట్లు వారు వివరించారు. అనంతరం ఫోన్ కల్వకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తండ్రిబిడ్డల కోసం ఎడారిలో వెతకడం ప్రారంభించారు. మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మరణించిన తండ్రి, చిన్న పిల్లల మృతదేహాలను గుర్తించినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







