సౌదీ ఎడారిలో దాహంతో తండ్రీ కొడుకులు మృతి
- June 18, 2022
సౌదీ: సౌదీ అరేబియాలోని అజ్మాన్ వ్యాలీ ఎడారిలో ఒక కువైట్ వ్యక్తి, అతని 8 ఏళ్ల కుమారుడు దాహంతో మరణించిన ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు తమ గొర్రెలు మేపుకుంటూ ఎడారిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి వస్తుండగా, వారి వాహనం ఇసుకలో చిక్కుకుందని, ఆ సమయంలో వారు సహాయం కోసం ఎవరినీ సంప్రదించలేకపోయారని స్థానిక మీడియా పేర్కొంది. ఇసుకలోంచి వాహనాన్ని బయటకు తీయడానికి తండ్రి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఆ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్రత్ మొఘటి ప్రాంతానికి కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ మధ్యలోనే దాహంతో వారు చనిపోయారు. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఎడారి ప్రాంతంలో డీహైడ్రేషన్ కారణంగా వారు అపస్మారక స్థితికి చేరుకుని మరణించారని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం తమతో ఫోన్లో మాట్లాడినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. తన కారు చెడిపోయిందని, దాన్ని సరిచేసుకొని వస్తానని తమకు తెలిపినట్లు వారు వివరించారు. అనంతరం ఫోన్ కల్వకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తండ్రిబిడ్డల కోసం ఎడారిలో వెతకడం ప్రారంభించారు. మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మరణించిన తండ్రి, చిన్న పిల్లల మృతదేహాలను గుర్తించినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







