టాలీవుడ్లో షూటింగ్లు బంద్..
- June 21, 2022
హైదరాబాద్: టాలీవుడ్లో సమ్మె సరైన్ మోగనుంది.కరోనా ప్రభావంతో గతకొంత కాలంగా తమ జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, సినీ కార్మికులు నిరసనకు దిగుతున్నారు.ఈ నెల 22 నుంచి అన్ని రకాల షూటింగ్లకు సినీ కార్మికులు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపారు.
ఈ నెల 22న ఫిలిం ఫెడరేషన్ ముట్టడికి 24 విభాలకు చెందిన సినీ కార్మికులు పిలుపునిచ్చారు. ఫిలిం ఫెడరేషన్లోని 24 క్రాఫ్టుల్లో జీతాలు పెంచాల్సి ఉంది.ఈ వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్లో ఉంది. కరోనా వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. ఇప్పటికైనా తమ గోడును సినీ పెద్దలు వినిపించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. తక్షణమే తమ వేతనాలు పెంచి, తమను ఆదుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాత మండలి సినీ కార్మికుల వేతనాల పెంపుపై స్పందించడం లేదని.. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘ నాయకులతో చర్చిస్తున్నామని.. రేపటి నుండి షూటింగ్ల నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రతి రెండేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు.మరి సినీ కార్మికుల డిమాండ్కు నిర్మాత మండలి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.ఒకవేళ వారి దగ్గర్నుండి సరైన సమాధానం రాకపోతే, సమ్మె సైరెన్ మోగడం తథ్యం అని అంటున్నారు సినీ కార్మికులు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు