నాన్-ఖతారీ యాజమాన్యంలో బ్యాంకుల పెంపు.. క్యాబినెట్ ఆమోదం
- June 23, 2022దోహా: ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అధ్యక్షతన అమిరి దివాన్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ప్రతిపాదన ఆధారంగా స్టాక్ ఎక్స్ఛేంజ్లో లీస్ట్ అయిన కొన్ని బ్యాంకులు, కంపెనీల మూలధనంలో ఖతారీయేతర పెట్టుబడిదారుల యాజమాన్యం శాతాన్ని పెంచడానికి మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం.. ఖతారీయేతర పెట్టుబడిదారు కింద ఉన్న బ్యాంకులు, కంపెనీల మూలధనంలో 100% వరకు పెంచుకునే అవకాశం ఏర్పడనుంది. క్యాబినెట్ తాజా నిర్ణయంతో 1- ఖతార్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ బ్యాంక్, 2- దోహా బ్యాంక్, 3- మెడికేర్ గ్రూప్, 4- ఖతార్ గ్యాస్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (నకిలత్), 5- ఖతార్ ఫ్యూయల్ కంపెనీ (వోకోడ్) బ్యాంకులు, కంపెనీలకు లబ్ధి కలుగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..