వేరుశెనగ పేస్ట్ లో దాచిన గంజాయి స్వాధీనం
- June 23, 2022
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వేరుశెనగ పేస్ట్ లో దాచి కౌంటీలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో 5.95 కిలోల గంజాయిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికన్ దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడి అనుమానస్పద తీరుతో కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యంత వినూత్న టెక్నాలజీని ఉపయోగించి – వేరుశెనగ పేస్ట్ రోల్స్ లో దాచిన నిషిద్ధ గంజాయిని గుర్తించినట్లు దుబాయ్ కస్టమ్స్ లోని ప్రయాణీకుల కార్యకలాపాల విభాగం డైరెక్టర్ ఇబ్రహీం అల్-కమాలి చెప్పారు. ప్రయాణికుడి బ్యాగ్లో ఆరు వేరుశెనగ పేస్ట్ రోల్స్ లోపల దాచిన 5.95 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









