అమెరికాలో జస్టిస్ ఎన్.వి.రమణ కోసం ఎన్నారైల 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
- June 25, 2022
అమెరికా: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను ప్రముఖ ప్రవాస తెలుగు సంఘాలన్నీ ఏకమై ఘనంగా సన్మానించాయి. శుక్రవారం(జూన్ 24న) రాత్రి 8.00 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్ నగరంలోని మిరాజ్ బాంక్యేట్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. 'మీట్ అండ్ గ్రీట్' పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగు ప్రవాసులు హాజరయ్యారు. అన్ని తెలుగు సంఘాలు ఒకే వేదిక మీద నుంచి తెలుగు జాతి ముద్దుబిడ్డ నూతలపాటి వెంకట రమణను సన్మానించడం ద్వారా 'మీట్ అండ్ గ్రీట్' అనేది అరుదైన కార్యక్రమంగా నిలిచిపోయింది. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు చెప్పారు. మాతృభాషలోనే చదివి తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







