పిల్లలకు వ్యాక్సినేషన్.. నిరాకరించిన తల్లిదండ్రులపై చర్యలు
- June 27, 2022
బహ్రెయిన్: కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సినేషన్ నిరాకరించారు. తమ పిల్లలకు వ్యాక్సినేషన్ నిరాకరించడం వల్ల కొంతమంది తల్లిదండ్రులను అధికారులు బహ్రెయిన్లోని డాక్లో దింపారు. మరోపక్క నేషనల్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్కు సంబంధించిన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఆయా పిల్లల తల్లిదండ్రులు విచారణను ఎదుర్కొంటున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. స్థానిక ఆరోగ్య క్లినిక్ల ద్వారా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని, అనేక ప్రయత్నాలు చేసినా వారు నిరాకరించారని.. అంతిమంగా వారిపై చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ చర్యల తీవ్రత, పర్యవసానాలను గురించి హెచ్చరించడానికి తల్లిదండ్రులను పిలిపించినట్లు అధికారులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమానికి కట్టుబడి ఉండాలని, చట్టపరమైన చర్యలను నివారించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







