ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ..
- June 30, 2022
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు , బిజెపి అగ్ర నేతలు హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పటు చేసింది.
హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జూలై 02, 03 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. జూలై 03వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ తరుణంలో మోడీ హైదరాబాద్ షెడ్యూల్ ను విడుదల చేసారు.
మోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
జులై 02 న
12 .45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని బయలుదేరుతారు.
2 .55 బేగం పేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు.
3.00కు బేగం పేట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో పయనం.
3.20 HICC నోవాటెల్ కి ప్రధాని చేరిక.
3.30 నోవాటెల్ కన్వేషన్ సెంటర్ కి ప్రధాని.
3.30 నుండి 4 గంటల వరకు రిజర్వ్.
సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మోడీ హాజరు
రాత్రి 9 గంటలు నుండి రిజర్వ్.
3.07.22 :
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4. 30 వరకు బీజేపీ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు.
సాయంత్రం 4. 30 నుండి 5.40 వరకు రిజర్వ్.
సాయంత్రం 5.55 HiCC వద్ద హెలిప్యాడ్ వద్దకు ప్రధాని.
సాయంత్రం 6.15 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి మోడీ.
6.30 నిమిషాలకి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్ కు పయనం.
6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.
రాత్రి 7.35 గంటలకు బహిరంగ సభ నుండి మోడీ పయనం.
ఆ రాత్రికి నోవాటెల్ లేదా రాజ్ భవన్ లో మోడీ బస.
4.07.22 :
ఉదయం 9.20కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి మోడీ.
బేగంపేట నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో పయనం.
10.10 నిమిషాలకు విజయవాడ చేరుకొనే అవకాశం.
ఇందులో మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉందంటున్న పోలీసులు. హైదరాబాద్ లో పర్యటన సందర్భంగా.. సోషల్ మీడియాపైన ప్రత్యేక మానిటరింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎప్పటికప్పుడు ఆ వింగ్ సోషల్ మీడియాలో పోస్టింగ్ చెక్ చేస్తూ ఉంటుందని తెలపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







