యూఏఈలో ఇంధన ధరల ఆధారంగా టాక్సీ ఛార్జీలు
- July 01, 2022
షార్జా: జూలై 1 నుంచి ఇంధన ధరల ఆధారంగా టాక్సీ ఛార్జీలు మారనున్నాయి. జూలై 1 నుండి యూఏఈ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించే ఇంధన ధరల ఆధారంగా షార్జాలో టాక్సీ ఛార్జీలు పెరగడం లేదా తగ్గడం జరుగవచ్చు. ఇంధన ధరలను బట్టి ప్రతి నెలా మీటర్ ఫ్లాగ్ డౌన్ రేటును పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (SRTA) తెలిపింది. యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రతి నెలాఖరున ఇంధన ధరలను ప్రకటిస్తుంది. గ్లోబల్ చమురు ధరలతో స్థానిక ఇంధన ధరలను సమం చేయాలని దేశం ఆగస్టు 2015లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది అమల్లో ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా జనవరి 2022 నుండి యూఏఈలో పెట్రోల్ ధరలు 56 శాతానికి పైగా పెరిగాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..