మ్యూజికాలజిస్ట్ హాసం రాజా కు ఉగాది పురస్కారం
- April 11, 2016
తెలుగు చలనచిత్ర సంగీతానికి సంబంధించిన సాధికార సమాచారానికి, విశ్లేషణలకు పెట్టింది పేరు హాసం రాజాగా పాపులర్ అయిన మంగు రాజా. మ్యూజికాలజిస్ట్ గా సినిమా పాటలను విశ్లేషించడమే కాకుండా వాటి తమిళ, హిందీ, కన్నడ, బెంగాళీ, ఇంగ్లీషు పాటల మూలాలను వెలికితీసి పరిశోధించి ఆ వివరాలను నలభై ఏళ్లుగా అందిస్తూనే ఉన్నారు ఆయన. సినిమా పాటలను ఒక పరిశోధనాంశంగా పరిచయం చేసారు. ఆ పాటల సాహిత్యం కావాలన్నా, సంగీతాభిమానులకే కాకుండా పత్రికలు, ఛానల్స్, అవార్డు కమిటీలు సినీ పరిశ్రమలోని వారికి సాధికరంగా అందచేసేది ఆయనే. గత నాలుగు దశబ్ధాల్లో నలభై వేలకు పైగా పాటలను వెయ్యికి పైగా సినీ సమాచార గ్రంధాలను సేకరించి...ఆయన కొనసాగిస్తున్న సినీ గీతా యజ్ఞం ఎందరికో మార్గదర్శకం కావాలని ఢిల్లీ తెలుగు అకాడమీ కోరుకుంటూ ఈ సంవత్సరం ఉగాది పురస్కారాన్ని హాసం రాజాకు అందచేసి సన్మాన్మించింది. ఈ సందర్భంగా హాసం రాజా స్పందిస్తూ....తెలుగు సినిమా పాటలకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో పాటల పై పరిశోధన ప్రారంభించాను. ప్రతి శ్రోతకి పాటల వివరాలు అందుబాటులో ఉండేందుకు రాజామ్యూజిక్ బ్యాంక్.కామ్ ఏర్పాటు చేసి అందులో పొందుపరుస్తున్నాను. ఇప్పటి వరకు నలభై వేల పాటలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాను. నా పుట్టుక తల్లిదండ్రులకు సంబంధించింది..నా చావు భార్యబిడ్డలకు సంబంధించింది నా బతుకు తెలుగు సినిమా పాటకి అంకితం. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తెలుగు సినిమా పాటల గురించి గవర్నమెంట్ ఓ కమిటీ వేసి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. నేను ఇప్పటి వరకు సేకరించిన పాటల నిథిని గవర్నమెంట్ కి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. త్వరలో ఈ విషయం పై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గార్ని కలుస్తాను. తెలుగు సినిమా పాటల పూర్తి వివరాలను సేకరించాలనే ఆసక్తి నాలో ఏర్పడడం...ఈరోజు నలభై వేల పాటలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడం.. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







