అక్టోబర్ 1 నుంచి కొత్త రకం టైర్లు వాడాల్సిందే…
- July 02, 2022న్యూ ఢిల్లీ: అక్టోబర్ 1 నుంచి దేశంలో ప్రయాణించే కార్లు, ట్రక్కులు, బస్సులకు కేంద్రం కొత్తగా విడుదల చేసిన ప్రమాణాలతో తయారు చేసిన టైర్లనే వాడాలాని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇకపై కొత్త రోలింగ్ రెసిస్టేన్స్ వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్, విషయాల్లో ఆటో మోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 142.2019 లో నిర్దేశించినట్లుగా ఉఁడాలని కేంద్రం పేర్కోంది. ప్యాసింజర్ కార్లు, లైట్ ట్రక్కలు, ట్రక్కులు బస్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. వాహానాలు రహదారుల మీద వెళ్లేప్పుడు రోడ్డును పట్టుకుని ఉండటం (రోలింగ్ రెసిస్టెన్స్) తడి రోడ్లపై జారిపోకుండా ఉండటం(వెట్ గ్రిప్) శబ్దం వెలువరించటం(సౌండ్ ఎమిషన్) కొత్త నిబంధనల ప్రకారం ఉండాలని కేంద్ర పేర్కోంది.
ఈ నిబంధనల అమలుతో భారత్ కూడా యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ కమీషన్ ఫర్ యూరప్ స్ధాయి ప్రమాణాలను ఆచరణలోకి తెచ్చినట్లు అవుతుందని తెలిపింది. టైర్ల్ రోలింగ్ రెసిస్టెన్స్ లో మార్పులు చేయటం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. వెట్ గ్రిప్ మార్పుల వల్ల టైర్ల బ్రేకింగ్ సామర్ధ్య పెరిగి రోడ్డు మీద తడి ఉన్నప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి అని కేంద్రం పేర్కోంది. ఇప్పటికే వాడుకలో ఉన్నపాత డిజైన్ల టైర్లు 2023 ఏప్రిల్ 1 నుంచి రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్ ప్రమాణాలను, అదే ఏడాది జూన్ 1 నుంచి సౌండ్ ఎమిషన్ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
ఐరోపాలో టైర్ లేబులింగ్ రెగ్యులైజేషన్ 2012 నుండి అమలులో ఉంది. గత సంవత్సరం, మన దేశంలో Ceat కంపెనీ… టైర్ పరిశ్రమలో ప్రబలంగా ఉన్న అంతర్జాతీయ రేటింగ్ సిస్టమ్లకు అనుగుణంగా లేబుల్-రేటెడ్ టైర్లను విడుదల చేసింది. కస్టమర్లు తమ వాహనాల కోసం టైర్లను కొనుగోలు చేసే ముందు ఈ సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడింది.ఫ్యూయల్ స్మార్ట్ మరియు సెక్యూరా డ్రైవ్ శ్రేణి టైర్లు.రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్ మరియు టైర్ నాయిస్ లెవెల్ వంటి ముఖ్యమైన టైర్ పనితీరు సూచికలపై రేటింగ్లు ఆధారపడి ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!