ఆహార నిల్వలు మరియు ధరలు స్థిరంగా ఉన్నాయి
- July 02, 2022
బహ్రెయిన్: దేశ పౌరుల అవసరాల నిమిత్తం కావల్సినంత నిత్యవసర వస్తువులు ,ఆహార నిల్వలు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి అని పరిశ్రమల మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.అంతేకాకుండా వాటి ధరల్లో ఏటువంటి మార్పులు లేవని కూడా స్పష్టం చేయడం జరిగింది.
ఈ సందర్భoగా మార్కెట్లలో తగినన్ని ఆహార నిల్వలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసిన పర్యాటక మరియు పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వశాఖల సహాయ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ అల్ అష్రఫ్ మాట్లాడుతూ మార్కెట్ వర్గాలు కుమ్మక్కై ధరల పెంపు , బ్లాక్ మార్కెటింగ్ మరియు ఇతరత్రా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే తగినన్ని ఆహార నిల్వలు మార్కెట్లలో ఉన్నాయి అని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొంటూనే వ్యాపారాలు నాణ్యతతో కూడిన నిత్యవసర వస్తువులను డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారులకు సరఫరా చేయాలని సూచించారు. ఇలా కాకుండా నాణ్యత లేని వస్తువులను పంపిణీ చేయడమే కాకుండా ధరలకు సంబంధించి వందతులు వ్యాప్తి చేసిన వారిపై ప్రజలు వాట్సప్, మెయిల్ మరియు కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
వాట్సాప్ నంబర్ : 17111225
కాల్ సెంటర్ నంబర్ : 80001700
మెయిల్ ఐడి : Tawasul or [email protected]
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







