ఆహార నిల్వలు మరియు ధరలు స్థిరంగా ఉన్నాయి
- July 02, 2022
బహ్రెయిన్: దేశ పౌరుల అవసరాల నిమిత్తం కావల్సినంత నిత్యవసర వస్తువులు ,ఆహార నిల్వలు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి అని పరిశ్రమల మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.అంతేకాకుండా వాటి ధరల్లో ఏటువంటి మార్పులు లేవని కూడా స్పష్టం చేయడం జరిగింది.
ఈ సందర్భoగా మార్కెట్లలో తగినన్ని ఆహార నిల్వలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసిన పర్యాటక మరియు పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వశాఖల సహాయ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ అల్ అష్రఫ్ మాట్లాడుతూ మార్కెట్ వర్గాలు కుమ్మక్కై ధరల పెంపు , బ్లాక్ మార్కెటింగ్ మరియు ఇతరత్రా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే తగినన్ని ఆహార నిల్వలు మార్కెట్లలో ఉన్నాయి అని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొంటూనే వ్యాపారాలు నాణ్యతతో కూడిన నిత్యవసర వస్తువులను డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారులకు సరఫరా చేయాలని సూచించారు. ఇలా కాకుండా నాణ్యత లేని వస్తువులను పంపిణీ చేయడమే కాకుండా ధరలకు సంబంధించి వందతులు వ్యాప్తి చేసిన వారిపై ప్రజలు వాట్సప్, మెయిల్ మరియు కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
వాట్సాప్ నంబర్ : 17111225
కాల్ సెంటర్ నంబర్ : 80001700
మెయిల్ ఐడి : Tawasul or [email protected]
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







