నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దుబాయ్ తెలుగు అసోసియేషన్

- July 05, 2022 , by Maagulf
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దుబాయ్ తెలుగు అసోసియేషన్

యూఏఈ: యూఏఈలోని ఫుజైరాలో ఒక క్వారి సంస్ధలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారితో సహా 20 మంది భారతీయులు చాలా కాలంగా పని చేస్తున్నారు.కానీ గత సంవత్సరం నుండి వీరికి సంస్ధ వేతనాలు చెల్లించడం లేదు.స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనుకొన్న వారికి గ్రాట్యూటి, బకాయి వేతనాలు కూడా ఇవ్వడం లేదు.ఒక వైపు రావల్సిన బకాయిలు రాలేక, జీతం లేక తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.

వీరి దయనీయ స్ధితి గురించి భారతీయ కాన్సులేట్ ద్వారా దుబాయ్ లోని తెలుగు అసోసియెషన్ తెలుసుకుని అండగా నిలిచింది.అసోసియేషన్‌కు చెందిన సాయి ప్రకాశ్,సాయికృష్ణా, చైతన్య, భీంశంకర్, ఫహీం,విజయభాస్కర్‌లు ఈ మెరకు ఫుజైరాకు వెళ్ళి ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు నెలరోజులకు సరిపడా ఆహార సామాగ్రి,ఇతర నిత్యావసర సరుకులు అందించారు.ఈ క్రమంలో ​దుబాయ్ లోని భారతీయ కాన్సులేటులోని కౌన్సల్ తాడు మాము తెలుగు అసోసియెషన్ ప్రతినిధులను అభినందించారు.దుబాయ్ లోని తెలుగు అసోసియేషన్ లు గతంలోనూ అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com