24 చిత్రంలోని ఓ పాటను నిత్యామీనన్ పాడింది...
- April 11, 2016
హీరో,హీరోయిన్లు గాయకులుగా మారుతున్న వేళ, ఓ మలయాళీ భామ మరోసారి తన గళాన్ని తెలుగు ప్రేక్షకులకు వినిపించనుంది. అయితే ఈ భామ మలయాళీ అయినప్పటికి తన తొలి సినిమాకు ఓన్ డబ్బింగ్ చెప్పుకొని, అందులో ఓ పాట కూడా పాడింది. మరి ఆమె ఎవరో కాదు నిత్యామీనన్. అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం సూర్య నటిస్తున్న 24 చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.మనం చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విక్రమ్ కుమార్ తమిళ స్టార్హీరో సూర్యతో 24 అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య మూడు భిన్న పాత్రలలో కనిపించనున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా, నిన్న ఉదయం చెన్నైలో 24 చిత్ర ఆడియో వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో తెలుగు ఆడియోను విడుదల చేశారు . 24 చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఈ చిత్రంలోని ఓ పాటను నిత్యామీనన్తో పాడించాడు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ పాట తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయం కావడం విశేషం. చంద్రబోస్ రాసిన లాలిజో అంటూ సాగే ఈ పాటను నిత్యా పాడింది. తమిళంలో ఇదే పాటను శక్తి శ్రీ గోపాలన్ పాడింది. నిత్యామీనన్ గుండె జారి గల్లంతయిందే చిత్రంలో కూడా ఓ పాట పాడిన సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









