ఈద్ అల్ అధా సందర్భంగా 505 మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన దుబాయ్ రాజు

- July 07, 2022 , by Maagulf
ఈద్ అల్ అధా సందర్భంగా 505 మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన దుబాయ్ రాజు

దుబాయ్: ఈద్ అల్ అధా సందర్భంగా  జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 505 మంది ఖైదీలు విడుదల కాబోతున్నారు.యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్‌ మొహమ్మద్ బిన్‌ రాషేద్‌ అల్‌ మఖ్తూం ఆదేశాల మేరకు 505 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు  పోలీస్ అధికారులు వెల్లడించారు.'ఈద్ అల్ అధా'తో పాటు ఖైదీల కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారికి విముక్తి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.వివిధ నేరాలు చేసి జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న వారిలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు వారిని విడుదల చేస్తున్నమన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com