భారత్ కరోనా అప్డేట్
- July 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో రోజు రోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 43 మరణాలు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,25,028 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 4.14 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 4,36,04,394
కేసులు నమోదు కాగా వారిలో 5,25,386 మరణించారు. దేశంలో కరోన రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది.
నిన్న కరోనా నుంచి 16,104 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,53,980కిచేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు దేశంలో గడిచిన 540 రోజులుగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు198,65,36,288 కోట్ల డోసుల టీకాలు వేశారు. నిన్న ఒక్కరోజే 12,26,795 డోసుల టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







