భారత్ కరోనా అప్డేట్
- July 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో రోజు రోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 43 మరణాలు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,25,028 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 4.14 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 4,36,04,394
కేసులు నమోదు కాగా వారిలో 5,25,386 మరణించారు. దేశంలో కరోన రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది.
నిన్న కరోనా నుంచి 16,104 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,53,980కిచేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు దేశంలో గడిచిన 540 రోజులుగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు198,65,36,288 కోట్ల డోసుల టీకాలు వేశారు. నిన్న ఒక్కరోజే 12,26,795 డోసుల టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









