ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు

- July 09, 2022 , by Maagulf
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు

యూఏఈ: అరాఫా దినోత్సవం, ఈద్ అల్ అదా సందర్భంగా అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యూఏఈ ప్రజలు, అరబ్, ఇస్లామిక్ ప్రజలందరికీ ఈద్ అల్ అదా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యం, భద్రతతో కూడిన జీవనాన్ని సాగించాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ అదా సందర్భంగా నా సోదరులు, ఎమిరేట్స్ పాలకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అభినందనలు.. ప్రపంచ ప్రజలకు శాంతి, సామరస్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో యూఏఈ అధ్యక్షుడు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com