మహేష్-త్రివిక్రమ్ మొదలెట్టేశారుగా.!
- July 09, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాని సెప్టెంబర్లో పట్టాలెక్కించనున్నట్లుగా ఓ శాంపిల్ వీడియో ఒకటి రిలీజ్ చేసి, కన్ఫామ్ చేశారు. ఈ వీడియోలో సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మహేష్ బాబును ఈ సినిమాలో సరికొత్తగా ప్రొజెక్ట్ చేయనున్నాడట త్రివిక్రమ్. గెటప్ పరంగా కొన్ని ఛేంజెస్ ఆల్రెడీ సూచించాడట మహేష్కి త్రివిక్రమ్. మహేష్ బాబు అదే పనిలో బిజీగా వున్నారట.
కాగా, గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘ఖలేజా’ సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబినేషన్పై భారీగా అంచనాలున్నాయ్. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్దేని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు, మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవల రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా, ఫైనల్గా సూపర్ హిట్ లిస్ట్లో చేరిపోయింది ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీ కట్టింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







