మహేష్-త్రివిక్రమ్ మొదలెట్టేశారుగా.!
- July 09, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాని సెప్టెంబర్లో పట్టాలెక్కించనున్నట్లుగా ఓ శాంపిల్ వీడియో ఒకటి రిలీజ్ చేసి, కన్ఫామ్ చేశారు. ఈ వీడియోలో సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మహేష్ బాబును ఈ సినిమాలో సరికొత్తగా ప్రొజెక్ట్ చేయనున్నాడట త్రివిక్రమ్. గెటప్ పరంగా కొన్ని ఛేంజెస్ ఆల్రెడీ సూచించాడట మహేష్కి త్రివిక్రమ్. మహేష్ బాబు అదే పనిలో బిజీగా వున్నారట.
కాగా, గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘ఖలేజా’ సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబినేషన్పై భారీగా అంచనాలున్నాయ్. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్దేని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు, మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవల రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా, ఫైనల్గా సూపర్ హిట్ లిస్ట్లో చేరిపోయింది ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీ కట్టింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







