ప్లీజ్.! రూమర్స్ ఆపేయ్యండి.! అంటూ ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేసిన హీరో తనయుడు.!

- July 09, 2022 , by Maagulf
ప్లీజ్.! రూమర్స్ ఆపేయ్యండి.! అంటూ ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేసిన హీరో తనయుడు.!

సీనియర్ హీరో విక్రమ్ హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్‌లో చేరారనీ, ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారంటూ శుక్రవారం ఓ వార్త ఫ్యాన్స్‌లో కలవరం పెంచిన సంగతి తెలిసిందే.
ఈ వార్తతో విక్రమ్ ఫ్యాన్సే కాదు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కాస్త ఘాటుగా స్పిందించారు.
‘నాన్న బాగానే వున్నారు. జస్ట్ చిన్నపాటి చెస్ట్ పెయిన్‌తో నాన్న హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు ఎలాంటి హార్ట్ ఎటాక్ రాలేదు. జనరల్ చెకప్ చేయించుకుని ఆయన డిశ్చార్జ్ అయిపోతారు.. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి, మా కటుంబ సభ్యులను అలాగే, ఆయన అభిమానులనూ ఆందోళనకు గురి చేయొద్దు. ఆయనకు కొద్దిగా స్పేస్ ఇవ్వండి. ప్లీజ్...’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించాడు ధృవ్ విక్రమ్.

అవును నిజమే, తమ అభిమాన హీరోకి హార్ట్ ఎటాక్ అనే న్యూస్ నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే. ఇలాంటి వార్తలను కాస్త గోప్యంగా వుంచడమే మంచిది. గతంలో ఈ తరహా న్యూస్ కారణంగా పలువురు సెలబ్రిటీలు ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం వున్నాయ్. 
మరోవైపు విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ శుక్రవారం విడుదలైంది. ‘బాహుబలి’ స్పూర్తితో రూపొందిన సినిమా ఇది. మణిరత్నం ఈ సినిమాకి దర్శకుడు. విజువల్స్ గ్రాండియర్ లుక్ పరంగా బాహుబలికి గట్టి పోటీ ఇచ్చే సినిమా అవుతుందని కోలీవుడ్ జనం ఆశిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com