ఒకే రోజులో రికార్డు స్థాయిలో 44 తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు
- July 12, 2022
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఒకే రోజులో 44 తీర్పులిచ్చింది.వేసవి సెలవుల అనంతరం విచారణలు పునఃప్రారంభమైన జూలై 11న ఈ ఘనత నమోదైంది.ఈ 44 తీర్పుల్లో 20 తీర్పులను జస్టిస్ ఎంఆర్ షా ఇచ్చారు. మే 23 నుంచి జూలై 10 వరకు అత్యున్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు అనే విషయం తెలిసిందే. ఇది ఇటీవలి కాలంలో ఓ రికార్డు.
కాగా, ఈ కేసుల్లో నేరస్థుల అప్పగింత ఒప్పందాలు, దేశీయ చట్టాలు, క్రిమినల్ అపీళ్లు, సివిల్ వివాదాలు, బ్యాంకింగ్, వ్యాపార వివాదాలు, కోర్టు ధిక్కారం కేసులు, కాంట్రాక్టుల అమలు వంటి అంశాలకు సంబంధించిన కేసుల్లో ఈ తీర్పులు వచ్చాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు మాట్లాడుతూ..వేసవి సెలవుల్లో తాము పరిశోధన చేయడానికి, తీర్పులు రాయడానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈ తీర్పుల వెనుక తర్కం, వివేకంతో కూడిన ఆలోచన వంటివి రాజ్యాంగ న్యాయస్థానాలు, జిల్లా న్యాయస్థానాలు దృష్ట్రాంతాలుగా తీసుకుంటాయని తెలిపారు. విశ్రాంత భారత న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల తర్వాత అనేక తీర్పులు ఇవ్వడానికి న్యాయమూర్తులు చేస్తున్న అద్భుతమైన కృషిని మనమంతా ప్రశంసించాలని తెలిపారు. న్యాయమూర్తులు సెమినార్లకు హాజరవడం, సమావేశాల్లో పాల్గొనడం వంటితోపాటు పరిశోధన, తీర్పులు రాయడం వంటివి చేయడం ప్రశంసనీయమని తెలిపారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









