ఒమన్ బీచ్ లో కొట్టుకుపోయిన ముగ్గురు భారతీయులు..
- July 14, 2022
మస్కట్: ఒమన్ సముద్ర తీరంలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.బీచ్లో భారతీయుడు, తన ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు.రాకాసి అలలు తండ్రి, ఇద్దరు పిల్లలను మింగేశాయి.ఆ ముగ్గురి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా తండ్రి, బాలుడి మృతదేహాలు లభ్యమయ్యాయి.కూతురి ఆచూకీ లభించలేదు.
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాకు చెందిన శశికాంత్ మెకానికల్ ఇంజినీర్గా దుబాయ్ లో స్థిరపడ్డారు. 20 ఏండ్ల నుంచి దుబాయ్లోనే శశికాంత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.దుబాయ్కి చెందిన ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు.అయితే బక్రీద్ రోజు సెలవు కావడంతో.. తన భార్య సారిక, ముగ్గురు పిల్లలతో కలిసి ఒమన్ సముద్ర తీరానికి వెళ్లారు.తీరంలో ఎంజాయ్ చేస్తుండగా రాకసి అలలు దూసుకొచ్చాయి.
దీంతో శశికాంత్.. ఇద్దరు పిల్లలు శృతి, శ్రేయాస్ అలల ధాటికి కొట్టుకుపోయారు. కళ్ల ముందే తన కుమార్తె, కుమారుడు కొట్టుకుపోవడాన్ని చూసిన తండ్రి.. అప్రమత్తమై వారిని కాపాడుకునేందుకు ముందుకెళ్లగా,ఆయన కూడా అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.ఒడ్డున ఉన్న భార్య, కూతురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు.ఈ విషయాన్ని శశికాంత్ సోదరుడు, న్యాయవాది రాజ్ కుమార్ ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







