భారీ సంఖ్యలో ప్రవాసుల అరెస్ట్
- July 15, 2022
కువైట్ సిటీ: కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ, రెసిడెన్సీ ఎఫైర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రెసిడెన్సీ ఉల్లంఘనదారులు భారీగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.తాజాగా హవాలీ గవర్నరెట్ పరిధిలో నిర్వహించిన సోదాల్లో 34 మంది ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.వీరంతా తమ రెసిడెన్సీ గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా ఆ దేశంలో ఉంటున్నట్లు తెలిపారు.అలాగే మరో చోట నిర్వహించిన తనిఖీల్లో మరో 26 మంది ఉల్లంఘనదారులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.గృహ కార్మికులను రిక్రూట్ చేసే ఓ ఫేక్ ఆఫీస్పై అధికారులు ఆకస్మీక దాడి నిర్వహించారు.దీంతో అక్కడ 26 మంది ప్రవాసులు దొరికినట్లు తెలియజేశారు.
ఇటీవల దేశవ్యాప్తంగా వరుస సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు ఇలా భారీ సంఖ్యలో వలసదారులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడి పట్టుబడుతున్నారు. సంబంధిత అధికారులు కూడా ప్రవాసులు అధికంగా ఉండే ప్రాంతాలపై నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఇక ఇప్పటికే కువైట్ అధికారులు అమ్నెస్టీ పథకం కింద పలుమార్లు నివాస గడువు ముగిసిన ప్రవాసులను దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా మంది దాన్ని ఉపయోగించుకోలేదు.నివాస అనుమతి గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్నారు.అలాంటి వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించడంతో పాటు జీవితంలో మళ్లీ కువైట్ రాకుండా నిషేధం విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







