భారీ సంఖ్యలో ప్రవాసుల అరెస్ట్
- July 15, 2022
కువైట్ సిటీ: కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ, రెసిడెన్సీ ఎఫైర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రెసిడెన్సీ ఉల్లంఘనదారులు భారీగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.తాజాగా హవాలీ గవర్నరెట్ పరిధిలో నిర్వహించిన సోదాల్లో 34 మంది ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.వీరంతా తమ రెసిడెన్సీ గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా ఆ దేశంలో ఉంటున్నట్లు తెలిపారు.అలాగే మరో చోట నిర్వహించిన తనిఖీల్లో మరో 26 మంది ఉల్లంఘనదారులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.గృహ కార్మికులను రిక్రూట్ చేసే ఓ ఫేక్ ఆఫీస్పై అధికారులు ఆకస్మీక దాడి నిర్వహించారు.దీంతో అక్కడ 26 మంది ప్రవాసులు దొరికినట్లు తెలియజేశారు.
ఇటీవల దేశవ్యాప్తంగా వరుస సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు ఇలా భారీ సంఖ్యలో వలసదారులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడి పట్టుబడుతున్నారు. సంబంధిత అధికారులు కూడా ప్రవాసులు అధికంగా ఉండే ప్రాంతాలపై నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఇక ఇప్పటికే కువైట్ అధికారులు అమ్నెస్టీ పథకం కింద పలుమార్లు నివాస గడువు ముగిసిన ప్రవాసులను దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా మంది దాన్ని ఉపయోగించుకోలేదు.నివాస అనుమతి గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్నారు.అలాంటి వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించడంతో పాటు జీవితంలో మళ్లీ కువైట్ రాకుండా నిషేధం విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







