కువైట్ లో ఏపీ వాసికి ఏపీఎన్ఆర్టీఎస్ వారి చేయూత
- July 15, 2022
కువైట్ సిటీ: కువైట్ లో జీవనోపాధి కొరకు వచ్చి,భీమవరం కు చెందిన, ఫ్రాన్క్లిన్ రాజు అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా కువైట్ లో బయట పని చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు. గతంగా రెండు రోజుల క్రితం అనారోగ్యం చేందడంతో,ఈ విషయం ఇండియా లోని వారి కుటుంబ సభ్యులు ఏపిఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్ మరియు డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ కి తెలపడం జరిగింది.వారు వెంటనే స్పందించి వైఎస్సార్సిపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి దృష్టికి తిసుకు రావడం జరిగింది. బాలిరెడ్డి రెడ్డి సూచన మేరకు ఈరోజు ఉదయం వైఎస్ఆర్సిపీ యువజన విభాగం నాయకులు, మర్రి కల్యాణ్ మరియు హనుమంత్ రెడ్డి, హరి ప్రసాద్ చౌదరి, తదితరులు ఆసుపత్రికి వెళ్లి అతని అరోగ్య పరిస్థితి,క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొన్నారు.
రాజు మాట్లాడుతూ...తన అరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వారికి తెలియచేసినారు.అతని అరోగ్యం మెరుగుపడిన వెంటనే ఇండియా కు స్వస్థలానికి పంపుటకు, వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి,పేపర్ వర్క్ పనులు పూర్తి చేసి సురక్షితంగా పంపడం జరుగుతుందని మర్రి కళ్యాణ్ తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









