కువైట్ లో ఏపీ వాసికి ఏపీఎన్ఆర్టీఎస్ వారి చేయూత
- July 15, 2022
కువైట్ సిటీ: కువైట్ లో జీవనోపాధి కొరకు వచ్చి,భీమవరం కు చెందిన, ఫ్రాన్క్లిన్ రాజు అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా కువైట్ లో బయట పని చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు. గతంగా రెండు రోజుల క్రితం అనారోగ్యం చేందడంతో,ఈ విషయం ఇండియా లోని వారి కుటుంబ సభ్యులు ఏపిఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్ మరియు డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ కి తెలపడం జరిగింది.వారు వెంటనే స్పందించి వైఎస్సార్సిపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి దృష్టికి తిసుకు రావడం జరిగింది. బాలిరెడ్డి రెడ్డి సూచన మేరకు ఈరోజు ఉదయం వైఎస్ఆర్సిపీ యువజన విభాగం నాయకులు, మర్రి కల్యాణ్ మరియు హనుమంత్ రెడ్డి, హరి ప్రసాద్ చౌదరి, తదితరులు ఆసుపత్రికి వెళ్లి అతని అరోగ్య పరిస్థితి,క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొన్నారు.
రాజు మాట్లాడుతూ...తన అరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వారికి తెలియచేసినారు.అతని అరోగ్యం మెరుగుపడిన వెంటనే ఇండియా కు స్వస్థలానికి పంపుటకు, వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి,పేపర్ వర్క్ పనులు పూర్తి చేసి సురక్షితంగా పంపడం జరుగుతుందని మర్రి కళ్యాణ్ తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







