వెబ్ సిరీస్కి సినిమా రేంజ్ బిల్డప్ ఇస్తున్నారుగా.!
- July 16, 2022
అక్కినేని కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమైన సుశాంత్ ఓటీటీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల నట్టింట్లో హంగామా షురూ చేశాడు సుశాంత్.
ఈ వెబ్ సిరీస్కి విభిన్న రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. నేచురల్ స్టార్ నానితో ఈ వెబ్ సిరీస్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయించిన ‘నీళ్ల ట్యాంక్’ అండ్ టీమ్ తాజాగా ఈ వెబ్ సిరీస్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేసింది.
ఆ ఈవెంట్లో ఫన్నీగా కమెడియన్ సుదర్శన్తో కలిసి సుశాంత్ స్టేజ్ పైనే ఓ స్కిట్ చేశాడు. సినిమాల్లో అవకాశాల్లేకపోతే, వెబ్ సిరీస్లు చేసేస్తావా.? అంటూ యాంకర్ ప్లేస్లో వున్న సుదర్శన్ అడగ్గా, అందుకు సుశాంత్ ఘాటైన కౌంటర్ ఇచ్చి ఎంటర్టైన్ చేశాడు.
ఏ వెబ్ సిరీస్లు చేస్తే తప్పేంటీ.? కంటెంట్ వున్నోడికి కటౌటౌతో పనేముంది.? అన్నట్లుగా ‘మా నీళ్ల ట్యాంక్’ కంటెంట్ చూసి మాట్లాడవోయ్..’ అన్నట్లుగా సుదర్శన్కి సమాధానమిచ్చాడు.
‘వరుడు కావలెను’ ఫేమ్ లక్ష్మీ సౌజన్య ఈ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించారు. ‘లీడర్’ ఫేమ్ ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది. ప్రోమోస్ చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తున్నాయ్. చూడాలి మరి, నెట్టింటి ప్రేక్షకుల్ని ఆ రేంజ్లో అలరిస్తుందో లేదో ‘మా నీళ్ల ట్యాంక్’.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









