ఖతార్లో ఒకేరోజు 900 కొవిడ్-19 కేసులు నమోదు
- July 16, 2022
దోహా: ఖతార్ లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. జూలై 15న (గత 24 గంటల్లో) 900 కంటే ఎక్కువ కోవిడ్-19 కేసులు నమోదయినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 971 రికార్డు కాగా.. అందులో 824 మంది కమ్యూనిటీ, 147 మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,789. అయితే తాజాగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని, గత 24 గంటల్లో 629 మంది రోగులు కోవిడ్ -19 నుండి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే గత 24 గంటల్లో ఒకరు ఐసీయూలో చేరడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉన్న రోగుల సంఖ్య 4కి చేరుకుంది. ఇప్పటి వరకు కోవిడ్-19 మొత్తం 7,278,111కి వ్యాక్సిన్ డోస్లు, 1,801,768 మందికి వ్యాక్సిన్ బూస్టర్ డోస్లు అందజేసినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







