యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్1 ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం
- July 18, 2022
కువైట్ సిటీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరివేక్షణలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రవికుమార్ వేమూరు మరియు యన్.ఆర్. ఐ. తెలుగుదేశం,పోలిటికల్ కోఆర్డినేటర్ బుచ్చిరామ్ ప్రసాద్ సూచనలు మరియు సలహాలు మేరకు, యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ కమిటీని, మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు 15-07-2022 నాడు విడుదల చేశారు.
ఇందులో యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ 1.అధ్యక్షులు గా నాగేంద్ర బాబు అక్కిలి 2. ఉపాధ్యక్షలు రహమతుల్లా షేక్ 3.ప్రధానకార్యదర్శిగా మల్లికార్జున మరాతు 4. కోశాదికారిగా మోహన్ రాచూరి 5.సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీనివాసరాజు వెలిగండ్ల,6.గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ వెంకట్ కోడూరి, తెలుగుదేశం పార్టీ మా పై నమ్మకము వుంచి ఈ బాద్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలము నుండి,కమిటీని విడుదల చేయడం ఆనందదాయకమైన శుభసంధర్భంలో, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, వేమూరి రవి, బుచ్చి రామ్ ప్రసాద్, రావి రాధాకృష్ణ కి NRITDP కువైట్ ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామని NRITDP కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి సంతోషం వ్యక్తం చేశారు.
కువైట్ లో ఉన్న తెలుగు దేశం పార్టీ వర్గాలను, అభిమానులను, సానుబూతి పరులను,కార్యకర్తలను, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించే మేధావులను, తటస్థులను, బడుగు బలహీన, దళిత మైనరటి వర్గాల నాయకులను, అందర్నీ “ ఒక వేదికగా “ చేసి, 12-11-2021 తారికున, మన రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి టి.డి.జనార్ధన్, దరూరి బలరాం నాయుడు,
ఇప్పుడు యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పోరాటాలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం, అదికారికంగా కమిటీని ప్రకటించడం చాలా సంతోషంగా వుందని, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మనస్ఫూర్తిగా దన్యవాదములు తెలియ చేస్తున్నామని యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్, సీనియర్ నాయకులు బలరాం నాయుడు మరియు యన్. ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ కోడూరి వెంకట్, అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, ఉపాధ్యక్షలు రహమతుల్లా షేక్ ప్రధానకార్యదర్శి మల్లికార్జున మరాతు, కోశాదికారి మోహన్ రాచూరి, సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీనివాసరాజు వెలిగండ్ల, ఒక సంయుక్త ప్రకటనలో తెలియచేసారు.
పటిష్టమైన కార్యవర్గం తో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటలకు,అధిష్టానం వారి ఆదేశాల మేరకు NRITDP కువైట్, తనవంతు బాద్యతగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోరాటాలుకు మద్దతు నిస్తున్న ప్రతి ఒక్కరికీ NRITDP కువైట్ ధన్యవాదములు తెలియచేస్తు, మీ సహాయ సహకారాలు వుండాలని కోరుకుంటున్నాము.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







