పంజాబ్లో ఎన్కౌంటర్..
- July 20, 2022పంజాబ్: ఇటీవల మరణించిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకులకు, పోలీసులకు మధ్య పంజాబ్లో ఎన్కౌంటర్ జరుగుతోంది.ఈ ఎన్కౌంటర్లో ఒక గ్యాంగ్స్టర్ మరణించినట్లు సమాచారం.అమృత్సర్ సమీపంలోని, అత్తారి సరిహద్దులో ఉన్న భన్కా గ్రామంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
సిద్ధూ మూసేవాలా హంతకులుగా భావిస్తున్న ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఈ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడానికి భన్కా గ్రామాన్ని చుట్టుముట్టారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్యాంగ్స్టర్స్కు మధ్య వందల రౌండ్ల కాల్పులు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు గ్యాంగ్స్టర్స్లో ఒకడైన జగ్రూప్ సింగ్ అలియాస్ రూప హతమయ్యాడు. మరో గ్యాంగ్స్టర్ మన్ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుసా కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మన్ను కుసా కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాడు.
ఈ ఎన్కౌంటర్లో పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. సిద్ధూ హత్యకు ప్రముఖ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. సిద్ధూను చంపే బాధ్యతను షూటర్లైన మన్ప్రీత్ సింగ్కు, జగ్రూప్ సింగ్కు అప్పగించాడు. వీరి ఆధ్వర్యంలోనే సిద్ధూ హత్య జరిగినట్లు అంచనా. ఇంకా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతోంది.యాంటీ-గ్యాంగ్స్టర్ టాస్క్ఫోర్స్ డీఎస్పీ విక్రమ్ బ్రార్ ఆధ్వర్యంలో ఈ ఎన్కౌంటర్ సాగుతోంది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!