తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..
- July 21, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్ర సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఎన్ని సంస్థలు తెలంగాణ లో వారి వ్యాపారాలు మొదలుపెట్టగా..తాజాగా ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్తో గురువారం జరిగిన భేటీలో ఈ ప్రకటనను తెలిపారు సంస్థ ప్రతినిధులు.
జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్లో రూ.1800కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్కు వివరించారు. దీని వల్ల 2500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ పేర్కొంది. జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్స్ తయారీపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ – ఈ విస్తరణను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









