కానిస్టేబుల్ ధైర్యానికి దేశంలోనే అత్యున్నత గౌరవం అభినంధించిన సైబరాబాద్ సీపీ
- July 21, 2022
హైదరాబాద్: ఈరోజు i.e., 21.07.2022 సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., భారత ప్రభుత్వం ద్వారా ప్రధానం చేయబడిన ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ పతకాన్ని అందుకున్న సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ కు చెందిన పోలీసు కనిస్టేబుల్ జి. శివ కుమార్ ను అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి పోలీసు అధికారి విధి నిర్వహణకు మించి ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేయాలని సూచించారు.
2018 సంవత్సరానికి గాను సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని కేశంపేట్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అధికారి జి. శివకుమార్ పిసికి *ప్రధానమంత్రి పోలీస్ మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్ అవార్డు* ను తేదీ 14.07.2022 న భారత ప్రభుత్వం ప్రధానం చేయడం జరిగింది. అయితే తేదీ 9.10.2017 న రాత్రి సుమారు 11:15 గంటల సమయంలో కానిస్టేబుల్ జి. శివ కుమార్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ డ్యూటీ చేస్తన్న సమయంలో.. భారీ వర్షాలకు షాద్నగర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన గడిగెల శేఖర్ గౌడ్ చెరువులో కొట్టుకుపోయాడు. డయల్ 100 ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే పిసి జి శివ కుమార్ బాధితుడిని (శేఖర్ గౌడ్) తాళ్ల సహాయంతో రక్షించేందుకు పక్కాగా ప్లాన్ చేసి, పోలీసు స్పెక్టర్ ఆదేశాల మేరకు పిసి జి శివకుమార్ వెంటనే నీటిలోకి దూకి 100 మీటర్ల దూరంలో ప్రవహించే నీటిలో ఇరుక్కుపోయిన బాధితుడిని తాడు సహాయంతో రక్షించాడు. మరియు అర్ధరాత్రి బాధితుడిని సుమారు 100 మీటర్ల దూరం నుండి సేఫ్ జోన్కు తీసుకువచ్చారు. రెస్యూస్ ఆపరేషన్కి గంటన్నర సమయం పట్టింది.బాధితుడికి వైద్య సహాయం అందించి అతని బంధువులకు అప్పగించారు.తనకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో మరియు శ్రద్ధతో విధులు నిర్వహించిన పీసీ జి.శివ కుమార్ కృషిని అభినందిస్తున్న భారత ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ పతకాన్ని అంధించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సీపీ తో పాటు షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







