బాబీ సింహా-రేష్మి ప్రేమ వివాహం ఈ నెల 22న
- April 13, 2016
: సినిమా రంగంలో ప్రేమవివాహాలు సర్వసాధారణమే. తాజాగా ఇదే బాటలో మరో సినీ జంట నడుస్తోంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న నటుడు బాబీ సింహా, నటి రేష్మి మీనన్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 22న తిరుపతిలో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుగబోతోంది.దీని గురించి బాబీ సింహా మాట్లాడుతూ 'కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రులు సమక్షంలో తిరుపతి వెంకటేశ్వరుడిని సన్నిధిలో మా వివాహం జరుగుతుంది. చెన్నైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నాం. ఈ వెడ్డింగ్ రిసెప్షన్కు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు.గతేడాది నవంబర్లో బాబీ సింహా, రేష్మి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 17 నుండి పెళ్లి సందడి మొదలు కానుంది. 17న చెన్నైలో సంగీత్ సెలబ్రేషన్స్, ఆ తర్వాత మొహందీ వేడుక జరుగబోతోంది. ఏప్రిల్ 24న చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ జరుగబోతోంది.తమిళంలో బాబీ సింహా, రేష్మి కెరీర్ బాగా సాగుతోంది. ఇటీవల సందీప్ కిషన్ మూవీ 'రన్' ద్వారా బాబీ సింహా విలన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన చేతిలో కో 2, ఇరవి, పాంభు సత్తై, మెట్రో, వల్లవనుక్కు వల్లవన్, కావాలయ్ వేండమ్ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. రేష్మి 'హైదరాబాద్ లవ్ స్టోరీ' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈచిత్రంలో ఆమె రాహుల్ రవీంద్రన్ తో కలిసి నటిస్తోంది. ఈ ఇద్దరు కలిసి ఉరుమీన్ అనే చిత్రంలో కలిసి నటించారు కూడా.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









