ముగ్గురు భారతీయులకు బ్రహ్మాండమైన గోల్డెన్ చాన్స్
- April 13, 2016
ముగ్గురు భారతీయులకు బ్రహ్మాండమైన గోల్డెన్ చాన్స్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన విద్యావేత్తలు, సామాజికంగా నిబద్ధత కలిగిన 55 మందిని ఎంపిక చేసి వారికి ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్షిప్స్ ప్రకటించగా, ఆ జాబితాలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. సాగ్నిక్ దత్తా, సంపూర్ణ చక్రవర్తి, మాళవికా నాయర్.. ఈ ముగ్గురికీ ఆ స్కాలర్షిప్ లభించింది. 30 దేశాలకు చెందిన 55 మంది విజేతలు 68 యూనివర్సిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం విజేతల్లో 36 మంది మహిళలు కాగా, 19 మంది మాత్రమే పురుషులున్నారు.సాగ్నిక్ దత్తా ఆరేళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేసి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కోల్కతాలో చదువుతున్నారు. ఆమె ఇప్పుడు ఈ స్కాలర్షిప్తో రాజకీయాలు, అంతర్జాతీయ పరిశోధనలో పీహెచ్డీ చేస్తారు. సంపూర్ణ చక్రవర్తి ఫార్మకాలజీలో పీహెచ్డీ చేయనున్నారు. ప్రధానంగా ఆర్థరైటిస్ నొప్పులకు మందు కనుక్కోవడంపై ఆమె దృష్టిపెడతారు. మెటీరియల్ సైన్స్, మెటలర్జీలలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ చేసేంఉదకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో మాళవికా నాయర్ చేరారు. ఈ స్కాలర్షిప్తో ఆమె మెటీరియల్స్ సైన్స్లో పీహెచ్డీ చేయనున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







