భారత రాష్ట్రపతి కి ఉపరాష్ట్రపతి మర్యాదపూర్వక విందు
- July 23, 2022
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ,ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మర్యాద పూర్వక విందు ఏర్పాటు చేశారు.న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కుటుంబ సమేతంగా విచ్చేశారు.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ, కుమారుడు హర్షవర్ధన్ లతో కలిసి అచ్చతెలుగు వంటకాలతో విందు ఆరగించారు.
రాష్ట్రపతిగా ఐదేళ్ళ పదవీ కాలాన్ని రామ్ నాథ్ కోవింద్ ఎంతో హుందాగా నిర్వహించారన్న ఉపరాష్ట్రపతి, వివిధ కీలక సందర్భాల్లో వారు వ్యవహరించిన తీరు వారి చక్కని పని తీరుకు నిదర్శనంగా నిలిచిందన్నారు.వారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న ఆయన, కోవింద్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమైనదని, ఆయన ఆలోచనలు, సందేశాలు, ప్రసంగాల నుంచి ఈతరం యువత ఎంతో నేర్చుకోవలసి ఉందన్నారు.వారి భవిష్యత్ జీవితం ఆరోగ్యకరంగా, అర్ధవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







