కువైట్ నుంచి తెలంగాణకి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు
- July 25, 2022
హైదరాబాద్: తెలంగాణలోని కామారెడ్డిలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి రీసెంట్గా కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చినట్లుగా తెలిసింది.గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.జులై 6న భారత్కు వచ్చిన మనిషిలో క్రమంగా జ్వరం పెరుగుతుండటంతో జులై 20న హాస్పిటల్ లో చేర్చారు.
జ్వరంతో పాటు ఒంటిపై పొక్కుల వంటివి కూడా కనిపించడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చినట్లు పబ్లిక్ హెల్త్ స్టేట్ డైరక్టర్ జీ.శ్రీనివాసరావు తెలిపారు.ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు.అలా అతణ్ని ఫీవర్ హాస్పిటల్ కు పంపారు.
పేషెంట్ శాంపుల్స్ ను సేకరించి పూణెకు పంపారు. ప్రస్తుతం అతణ్ని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ హెల్త్ మినిష్టర్ టీ హరీశ్ రావు పరిస్థితిని సమీక్షించి తప్పనిసరి చర్యలను వెంటనే తీసుకోవాలని సూచించారు.
“అతనితో ఆరుగురు వ్యక్తులు కాంటాక్ట్ అయినట్లు తెలిసింది. వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచాం” అని సీనియర్ హెల్త్ ఆఫీసర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







